ఫెడరర్, నడాల్ నిజమైన చాంపియన్లు
ABN , First Publish Date - 2020-11-05T10:15:35+05:30 IST
ఫెడరర్, నడాల్ నిజమైన చాంపియన్లు
సానియా, సింధు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): టెన్నిస్ దిగ్గజాలు రోజర్ ఫెడరర్, రఫెల్ నడాల్ నిజమైన చాంపియన్లు అని భారత స్టార్ క్రీడాకారిణులు సానియా మీర్జా, పీవీ సింధు కొనియాడారు. ఫెడరర్, నడాల్పై ఓ ఆంగ్ల చానెల్ రూపొందిస్తున్న డాక్యుమెంటరీలో సానియా, సింధు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ‘ఫెడరర్, నడాల్ తమ ఆటతో మాత్రమే దిగ్గజాలు కాలేదు. వారి వ్యక్తిత్త్వం ఆ ఇద్దరినీ ఉన్నత స్థానంలో నిలబెట్టింది. కోర్టులో హోరాహోరీగా తలపడే ఆ ఇరువురు మ్యాచ్ ముగియగానే ఒకరిపై ఒకరు చూపించే గౌరవం వారి ఔనత్యాన్ని పెంచింది’ అని సానియా చెప్పింది. ‘2004లో మియామి మాస్టర్స్లో అప్పటి వరల్డ్ నెంబర్ వన్ ఫెడరర్పై నడాల్ అద్భుతంగా పోరాడి విజయం సాధించాడు. ఆ మ్యాచ్ నన్ను చాలా ప్రభావితం చేసింది. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఎవరికి ఎవరూ తీసిపోరు. వారు నిజమైన చాంపియన్లు’ అని సింధు తెలిపింది.