పెళ్లయిన 15 రోజులకే..!
ABN , First Publish Date - 2021-07-30T04:32:03+05:30 IST
పెళ్లయిన పదిహేనురోజులకే రోడ్డు ప్రమాదంలో
- రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. భార్యకు గాయాలు
చేవెళ్ల: పెళ్లయిన పదిహేనురోజులకే రోడ్డు ప్రమాదంలో భర్త మృతి, భార్యకు గాయాలైన ఘటన ఆలూర్ బస్సు స్టేజీ సమీపంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు, మృతుడి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలం టేకులపల్లికి చెందిన తంబలపల్లి ఏసుదాస్(24), అతడి భార్య పరిశుద్ధతో కలిసి చేవెళ్ల మండలం దామరిగిద్దలో వారి బంధువు మృతిచెందడంతో అంత్యక్రియలకు బైక్పై బయల్దేరారు. ఆలూర్ బస్సు స్టేజీ సమీపంలోకి రాగానే ఎదురుగా వచ్చిన డీసీఎం బైక్ను ఢీకొంది. భార్యాభర్తలిద్దరూ రోడ్డుపక్కన పడిపోయారు. ఏసుదాస్ తల పగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. పరిశుద్ధ తలకు గాయం కావడంతో ఆమెను చేవెళ్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఏసుదాస్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఏసుదా్సకు 15రోజుల క్రితమే వికారాబాద్ జిల్లా అత్వెల్లికి చెం దిన పరిశుద్ధతో వివాహమైంది. ఇంతలోనే దారుణం చోటుచేసుకోవడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి.