ఏపీలో ఆగస్టు 14 వరకూ కర్ఫ్యూ ఆంక్షలు

ABN , First Publish Date - 2021-08-01T03:00:34+05:30 IST

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆగస్టు 14 వరకూ కర్ఫ్యూ ఆంక్షలు అమలులో

ఏపీలో ఆగస్టు 14 వరకూ కర్ఫ్యూ ఆంక్షలు

అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో  ఆగస్టు 14 వరకూ కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉంటాయని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. మాస్క్ లేకుండా తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ తెలిపారు. ఆఫీసులు, సంస్థలు, వ్యాపార సముదాయాలు, దుకాణాల్లో నిబంధనలను మరింత కఠినతరం చేసింది. మాస్క్లు లేని వారిని లోపలికి అనుమతిస్తే రూ.10 వేల నుండి రూ.25 వేల వరకు జరిమానా విధించాలని ఆదేశాలు ఇచ్చింది. 2,3 రోజుల పాటు సంబంధిత సంస్థల్ని మూసివేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఆంక్షలను ఉల్లంఘించే వారి ఫొటోలను 8010968295కు వాట్సప్ చేయాలని, వారిపై చర్యలు తీసుకుంటామని ఆరోగ్య శాఖ ప్రకటించింది. మాస్క్‌లు ధరించని వారికి రూ.100 జరిమానా విధిస్తామని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 

Updated Date - 2021-08-01T03:00:34+05:30 IST