వితంతువులకు కుటుంబ పింఛను కట్‌

ABN , First Publish Date - 2020-09-25T08:48:16+05:30 IST

కుటుంబ పింఛను పొందుతున్న వితంతువులు/ విడాకులిచ్చిన కుమార్తెలకు 45 ఏళ్లు నిండిన వెంటనే పెన్షన్‌ నిలిపేయాలని ఆర్థికశాఖ

వితంతువులకు కుటుంబ పింఛను కట్‌

45 ఏళ్లు నిండిన వెంటనే నిలిపివేత 

ఆదేశాలు జారీ చేసిన ఆర్థికశాఖ 


అమరావతి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): కుటుంబ పింఛను పొందుతున్న  వితంతువులు/ విడాకులిచ్చిన కుమార్తెలకు 45 ఏళ్లు నిండిన వెంటనే పెన్షన్‌ నిలిపేయాలని ఆర్థికశాఖ ఆదేశాలిచ్చింది. వితంతువులు/విడాకులిచ్చిన కుమార్తెల కుటుంబ పింఛన్ల అర్హతలపై స్పష్టతనిస్తూ మెమో జారీ చేసింది. గతంలో వారికి ఎక్కువ చెల్లించి ఉన్నా ఎలాంటి రికవరీ చేయరాదని పేర్కొంది. కుటుంబ పింఛనుకు సంబంధించిన కేసులన్నీ మరోసారి సమీక్షించాలని, అనర్హులకు పెన్షన్‌ నిలిపివేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని, తిరిగి పెళ్లి చేసుకోవడం, సంపాదన ప్రారంభించడం, పిల్లలు మేజర్‌ అవడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.


కేటగిరీ-2 కింద పెన్షన్‌ మంజూరైన వారికి ఎలాంటి అంతరాయం లేకుండా అర్హత ఉన్నంత కాలం అంటే 45ఏళ్లు పూర్తయ్యే వరకు చెల్లించే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. కుటుంబ పెన్షన్‌ పొందుతున్న వారు మృతిచెందిన ఏడాది లోపు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఆ మెమోలో ఆర్థికశాఖ సూచించింది. 


Updated Date - 2020-09-25T08:48:16+05:30 IST