శ్రీవారి రూ.300 దర్శన టికెట్ల విడుదల
ABN , First Publish Date - 2020-12-01T09:46:16+05:30 IST
శ్రీవారి రూ.300 దర్శన టికెట్ల విడుదల
నేడు అందుబాటులోకి వైకుంఠ ద్వార దర్శన టికెట్లు
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి సంబంధించి డిసెంబరు నెల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను సోమవారం టీటీడీ ఆన్లైన్ ద్వారా విడుదల చేసింది. మంగళవారం నుంచి 23 వరకు రోజుకు 20 వేల టికెట్ల చొప్పున 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేశారు. ఇదిలా ఉంటే... వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కోటాను మంగళవారం విడుదల చేయనున్నారు.