కలికాలం పోలీసులు.. దాసోజు ట్వీట్ వైరల్

ABN , First Publish Date - 2021-04-11T20:14:26+05:30 IST

ట్రాఫిక్ నిబంధనలపై పోలీసులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే.

కలికాలం పోలీసులు.. దాసోజు ట్వీట్ వైరల్

ఇంటర్నెట్ డెస్క్: ట్రాఫిక్ నిబంధనలపై పోలీసులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే పొద్దున లేస్తే ట్రాఫిక్ నిబంధనలపై నెట్టింట ఊదరగొట్టే పోలీసులు.. వారే నిబంధనలను ఉల్లంఘించడం చర్చనీయాంశమైంది. సామాన్యుడికి బోధించే ముందు పోలీసులు తమ సిబ్బందికి అవగాహన కల్పించాలంటూ నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


నిబంధనలు ఉల్లంఘిస్తున్న పోలీస్ సిబ్బందిపై తాజాగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ఓ ద్విచక్ర వాహనంపై ముగ్గురు మహిళా పోలీసులు వెళుతూ... ఫోన్ మాట్లాడుతున్న ఫొటోను ఆయన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘‘బైక్‌పై ముగ్గురు ప్రయాణించడమే పెద్ద తప్పు. అందులోని ఇద్దరూ సెల్ ఫోన్ మాట్లాడుతున్నారు. అంతేనా, మధ్యలో కూర్చున్న ఆమె, డ్రైవింగ్ చేస్తున్న వారి చెవిలో ఫోన్ పెట్టి మరి సహకరిస్తుంది. ఇక హెల్మెట్ ఉందా..? అంటే అదీ లేదు. కలికాలం పోలీసులు’’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు రాష్ట్ర డీజీపీని ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. పెద్ద ఎత్తున నెటిజన్లు రీట్వీట్లు చేస్తూ... పోలీస్ సిబ్బంది తీరును విమర్శిస్తున్నారు. 



Updated Date - 2021-04-11T20:14:26+05:30 IST