బంధాలను తుంచేస్తూ...

ABN , First Publish Date - 2020-07-10T08:25:24+05:30 IST

కరోనా మహమ్మారి మానవ సంబంధాలను ముక్కలు చేస్తోంది. శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతానికి చెందిన వృద్ధుడు(70) వైరస్‌ లక్షణాలతో మృతిచెందగా..

బంధాలను తుంచేస్తూ...

  • సిక్కోలులో వృద్ధుడి మృతి 
  • అంత్యక్రియలకు ముందుకురాని కుటుంబసభ్యులు
  • కృష్ణాలో మృతదేహాన్ని గోతిలోకి దొర్లించి ఖననం 

పలాస/ముసునూరు, జూలై 9: కరోనా మహమ్మారి మానవ సంబంధాలను ముక్కలు చేస్తోంది. శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతానికి చెందిన వృద్ధుడు(70) వైరస్‌ లక్షణాలతో మృతిచెందగా.. అంత్యక్రియలకు కుటుంబ సభ్యులెవరూ ముందుకు రాలేదు. దీంతో అధికారులే ఆ వృద్ధుడికి దహన సంస్కారాలు చేశారు. మరోఘటనలో, కృష్ణాజిల్లా ముసునూరు మండలానికి చెందిన ఓ వృద్ధుడికి 20రోజుల క్రితం పాజిటివ్‌ వచ్చింది. చికిత్స అనంతరం 3రోజుల క్రితం డిశ్చార్జ్‌ చేశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన గురువారం మధ్యాహ్నం మృతిచెందాడు. బంధువులు, గ్రామస్థులు ఎవ్వరూ చూసేందుకు వెళ్లలేదు. ఆయన కుమారులు మృతదేహాన్ని ట్రాక్టర్‌పై తీసుకెళ్లి ఎక్కడా ముట్టుకోకుండానే లిఫ్టు లేపి గోతిలోకి దొర్లించి ఖననం చేశారు.

Updated Date - 2020-07-10T08:25:24+05:30 IST