Tokyo Olympics: చరిత్ర సృష్టించి ఓటమి పాలైన దీపిక
ABN , First Publish Date - 2021-07-30T21:32:38+05:30 IST
ఆర్చరీలో క్వార్టర్ ఫైనల్కు చేరిన తొలి ఇండియన్గా రికార్డు సృష్టించిన దీపికా కుమారి కీలక మ్యాచ్లో ఓడి నిరాశ పరిచింది
టోక్యో: ఆర్చరీలో క్వార్టర్ ఫైనల్కు చేరిన తొలి ఇండియన్గా రికార్డు సృష్టించిన దీపికా కుమారి కీలక మ్యాచ్లో ఓడి నిరాశ పరిచింది. పతకం ఖాయమనుకున్న వేళ కొరియా సెన్షేనల్ యాన్ శాన్ చేతిలో 0-6తో ఓటమి పాలైంది. ఇప్పటి వరకు అసాధారణ ప్రతిభ కనబరిచిన దీపిక క్వార్టర్ ఫైనల్లో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. కాగా, టోక్యో గేమ్స్లో మూడో పతకంపై కన్నేసిన యాన్ ఇప్పటికే రెండు పతకాలు అందుకుంది. మహిళల టీమ్తోపాటు మిక్స్టీ ఈవెంట్లోనూ పతకాలు గెలుచుకుంది. వరుస సెట్లను కోల్పోయిన దీపిక తీవ్ర నిరాశ చెందింది.