నిద్రలేని రాత్రులు గడిపా..

ABN , First Publish Date - 2021-05-29T08:44:21+05:30 IST

ఐపీఎల్‌ సమయంలో కుటుంబ సభ్యులకు కరోనా సోకడంతో దాదాపు పదిరోజుల పాటు నిద్ర లేకుండా గడిపానని ఢిల్లీ క్యాపిటల్స్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ తెలిపాడు.

నిద్రలేని రాత్రులు గడిపా..

ముంబై: ఐపీఎల్‌ సమయంలో కుటుంబ సభ్యులకు కరోనా సోకడంతో దాదాపు పదిరోజుల పాటు నిద్ర లేకుండా గడిపానని ఢిల్లీ క్యాపిటల్స్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ తెలిపాడు. దీంతో ఒత్తిడితోపాటు సరైన నిద్ర లేక తాను ఐపీఎల్‌ మధ్యలోనే ఇంటికి వెళ్లిపోయానని చెప్పాడు. ‘మా కుటుంబ సభ్యుల్లో పది మందికి కరోనా సోకింది. దీంతో కనీసం 8-9 రోజుల పాటు నిద్రలేకుండానే గడిపా. ఆ పరిస్థితుల్లోనూ మ్యాచ్‌లు ఆడా. ఇక కాదనుకుని లీగ్‌ను వదిలి ఇంటికెళ్లిపోయా. అప్పటికి నేను సరైన పనే చేశా. మా వాళ్లు కోలుకోగానే తిరిగి ఐపీఎల్‌కు వద్దామనుకున్నా. కానీ ఇంతలోనే లీగ్‌ వాయిదాపడింది’ అని అశ్విన్‌ చెప్పాడు. ప్రస్తుతం అశ్విన్‌ టీమిండియాతో కలిసి ముంబైలోనే క్వారంటైన్‌లో ఉన్నాడు.

Updated Date - 2021-05-29T08:44:21+05:30 IST