ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 163
ABN , First Publish Date - 2020-09-30T03:17:36+05:30 IST
షేక్ జాయేద్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతున్న...
అబుదాబి: షేక్ జాయేద్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతున్న ఐపీఎల్ 2020 11వ మ్యాచ్లో సన్రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ జట్టుకు ఓపెనర్లు డేవిడ్ వార్నర్, బెయిర్స్టో శుభారంభాన్ని అందించారు. 77 పరుగుల వద్ద సన్రైజర్స్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. మిశ్రా బౌలింగ్లో పంత్కు కీపర్ క్యాచ్గా చిక్కి వార్నర్(45) వెనుదిరిగాడు.
ఆ తర్వాత క్రీజులోకొచ్చిన మనీష్ పాండే 3 పరుగులకే రబడ బౌలింగ్లో షాట్కు యత్నించి క్యాచ్గా చిక్కి ఔటయ్యాడు. అనంతరం.. క్రీజులోకొచ్చిన విలియమ్సన్, బెయిర్స్టోతో కలిసి నిలకడగా ఆడాడు. విలియమ్సన్ 26 బంతుల్లో 41 పరుగులు చేశాడు. బెయిర్స్టో 53 పరుగులు చేసి హాఫ్ సెంచరీ చేసుకుని దూకుడుగా ఆడుతుండగా.. రబడ బౌలింగ్లో క్యాచ్గా చిక్కి ఔటయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో రబడకు రెండు, మిశ్రాకు రెండు వికెట్లు దక్కాయి.