టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ
ABN , First Publish Date - 2021-04-11T00:43:49+05:30 IST
delhi capitals won the toss and elected to field ..
ముంబై: ఇండియాన్ ప్రీమియర్ లీగ్ 2021లో భాగంగా మరికాసేపట్లో ప్రారంభం కాబోతున్న రెండో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టు ఎంఎస్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనుంది. కాగా.. అయ్యర్ గైర్హాజరీలో తొలి సారిగా ఢిల్లీ జట్టుకు రిషబ్ పంత్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ధోనీతో ఢీకొట్టి పంత్ నెగ్గుతాడా..? లేక ధోనీ అనుభవం ముందు తలొంచతాడా..? అనేది మరికొద్ది గంటల్లో తేలిపోతుంది. కాగా.. బోణీ ఎవరు కొడతారో వేచి చూడాలి.