టాస్ గెలిచిన ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ

ABN , First Publish Date - 2021-04-19T00:45:53+05:30 IST

పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్..

టాస్ గెలిచిన ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ

ముంబై: పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ.. పిచ్‌పై మంచు ఉందని, రెండో ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్‌కు దీనివల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అన్నాడు. దానిని దృష్టిలో ఉంచుకునే ఫీల్డింగ్ ఎంచుకున్నామని తెలిపాడు. కాగా.. టామ్ కర్రాన్ స్థానంలో స్టీవ్ స్మిత్ జట్టులోకి తీసుకున్నట్లు పంత్ తెలిపాడు. అనంతరం పంజాబ్ కెప్టెన్ రాహుల్ మాట్లాడుతూ.. ఓటముల నుంచి ఎంతో కొంత నేర్చుకుని ముందుకు సాగాలని, తాము అదే చేయాలనుకుంటును్నామని తెలిపాడు. జట్టులోకి మురుగన్ అశ్విన్ బదులు జలజ్ సక్సేనాను తీసుకున్నామని తెలిపాడు.

Updated Date - 2021-04-19T00:45:53+05:30 IST