రాష్ట్రంలో మళ్ళీ ‘డెంగ్యూ’... విద్యార్ధిని మృతి

ABN , First Publish Date - 2020-06-05T20:36:19+05:30 IST

కరోనా కనుమరుగు కాకముందే డెంగీ రూపంలో మరో ప్రమాదం ముంచుకొస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తిలో డెంగీ భారీన పడి ఐఐటీ విద్యార్థిని దీక్షిత మృతి చెందింది. వనపర్తి జిల్లా అమరచింతకు చెందిన దీక్షిత ఐఐటీలో జాతీయ స్థాయిలో 241 వ ర్యాంకును సాధించి వారణాసిలో ఐఐటీ మొదటి సంవత్సరం చదువుతోంది.

రాష్ట్రంలో మళ్ళీ ‘డెంగ్యూ’... విద్యార్ధిని మృతి

హైదరాబాద్ : కరోనా కనుమరుగు కాకముందే డెంగీ రూపంలో మరో ప్రమాదం ముంచుకొస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తిలో డెంగీ భారీన పడి ఐఐటీ విద్యార్థిని దీక్షిత మృతి చెందింది. వనపర్తి జిల్లా అమరచింతకు చెందిన దీక్షిత ఐఐటీలో జాతీయ స్థాయిలో 241 వ ర్యాంకును సాధించి వారణాసిలో ఐఐటీ మొదటి సంవత్సరం చదువుతోంది.


తండ్రి సీత్యానాయక్‌ హైదరాబాద్ లో ప్రభుత్వోద్యోగిగా పని చేస్తున్నారు. డెంగీ బారిన పడి కుమార్తె మృతి చెందడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. స్వగ్రామమైన చంద్రనాయక్‌ తండాకు విద్యార్థిని దీక్షిత మృతదేహాన్ని తరలించిన అనంతరం, ఆమె తండ్రి ఖనన కార్యక్రమాలు పూర్తి చేశారు. చదువులో చురుకుగా ఉండే దీక్షిత డెంగీతో మృతి చెందడం గ్రామంలో విషాదాన్ని నింపింది. 

Updated Date - 2020-06-05T20:36:19+05:30 IST