వ్యవసాయశాఖలో మరో ఇద్దరు ఏడీలు
ABN , First Publish Date - 2021-06-11T10:08:08+05:30 IST
ఇటీవల రాష్ట్ర కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు వ్యవసాయశాఖలో రెండు అడిషనల్ డైరెక్టర్(ఏడీ) పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇటీవల రాష్ట్ర కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు వ్యవసాయశాఖలో రెండు అడిషనల్ డైరెక్టర్(ఏడీ) పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అడిషనల్ డైరెక్టర్ (అగ్రికల్చర్ ఇన్పుట్స్), అడిషనల్ డైరెక్టర్(రీసెర్చ్ అండ్ మార్కెట్ అనాలసిస్) పోస్టులు మంజూరు చేస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీచేశారు. కొత్తగా మంజూరైన రెండు పోస్టుల్లో సర్వీస్ సీనియారిటీ ప్రకారం.. సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో వ్యవసాయశాఖ అధికారులుగా పనిచేస్తున్న నరసింహారావు, ఆశాకుమారిలను నియమించే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.