అంబులెన్స్‌ల కొనుగోలుపై ప్రతిపక్షాల ఆరోపణలు సరికాదు: నారాయణ స్వామి

ABN , First Publish Date - 2020-07-02T16:47:00+05:30 IST

అంబులెన్స్‌ల కొనుగోలుపై ప్రతిపక్షాల ఆరోపణలు సరికాదు: నారాయణ స్వామి

అంబులెన్స్‌ల కొనుగోలుపై ప్రతిపక్షాల ఆరోపణలు సరికాదు: నారాయణ స్వామి

తిరుపతి: నిరుపేద రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలను అందిస్తున్నామని ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి తెలిపారు. గురువారం చిత్తూరు జిల్లాలో  104, 108, నియోనెటర్ అంబులెన్స్ సర్వీసులను ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, పంచాయతీరాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి  రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకే అత్యాధునికమైన అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి ఏపీ సీఎం అని అన్నారు. అంబులెన్స్‌ల కొనుగోలుపై ప్రతిపక్ష నేతలు అవినీతి ఆరోపణలు చేయడం సరైంది కాదని నారాయణ స్వామి మండిపడ్డారు. 


మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ..చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేతలు విమర్శలు చేసే ముందు నిజాలేంటో తెలుసుకోవాలని హితవు పలికారు. కరోనా వైరస్ ప్రబలకుండా  రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగానే ఉందని మంత్రి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. 

Updated Date - 2020-07-02T16:47:00+05:30 IST