వైసీపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన దేవినేని

ABN , First Publish Date - 2020-10-30T22:27:40+05:30 IST

వైసీపీ ప్రభుత్వాన్ని మాజీమంత్రి దేవినేని ఉమ సూటిగా ప్రశ్నించారు. రాజధాని లేదు, పోలవరం లేదు, హోదా లేదు, రైల్వేజోన్ లేదు అని ప్రచారం చేస్తారా? అని ప్రశ్నించారు.

వైసీపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన దేవినేని

అమరావతి: వైసీపీ ప్రభుత్వాన్ని మాజీమంత్రి దేవినేని ఉమ సూటిగా ప్రశ్నించారు. రాజధాని లేదు, పోలవరం లేదు, హోదా లేదు, రైల్వేజోన్ లేదు అని ప్రచారం చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రతిష్ట దిగజారే నిర్ణయాలు తీసుకోవడం ఎందుకు?.. లక్షల కోట్లు అప్పుచేస్తూ ప్రజలసొమ్ముతో ఈ దుబారా ఎందుకు అని నిలదీశారు. కరోనాతో పనులు లేక కార్మికులు, వరదలతో రైతులు ఆకలి కేకలు వేస్తుంటే కోట్లు గుమ్మరించి పబ్లిసిటీ చేయించుకుంటారా? అని దేవినేని ఉమ ప్రశ్నించారు. దేవినేని ఉమ ఎప్పటికప్పుడు ప్రభుత్వం చేపతున్న ప్రజా వ్యతిరేక విధానాలను తప్పుబడుతున్నారు. ప్రభుత్వాన్ని ఆయన కడిగిపారేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2020-10-30T22:27:40+05:30 IST