ఇది రైతు దగా కదా జగన్..: దేవినేని ఉమ

ABN , First Publish Date - 2020-07-12T16:51:58+05:30 IST

ఎన్నికల ముందు అందరికీ సున్నా వడ్డీ అని చెప్పిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. సీఎం అయిన తర్వాత ప్లేట్ మార్చేశారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఆరోపించారు.

ఇది రైతు దగా కదా జగన్..: దేవినేని ఉమ

అమరావతి : ఎన్నికల ముందు అందరికీ సున్నా వడ్డీ అని చెప్పిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. సీఎం అయిన తర్వాత ప్లేట్ మార్చేశారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఆరోపించారు. ఆదివారం నాడు ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఎన్నికల ముందు అందరికీ సున్నావడ్డీ. ఏడాది తర్వాత జీఓ 4530 ఇచ్చి లక్షలోపే సున్నా వడ్డి (4%). కేంద్రం 3లక్షలకు 3% వడ్డీ రాయితీ ఇస్తుంది. రైతులు అసలు, వడ్డీ ముందే చెల్లించాలంట. ఈ-క్రాఫ్ నమోదవ్వాలంట. మీరిచ్చే రైతు భరోసా సొమ్ము సున్నావడ్డీ, పావలావడ్డీ ఎగవేతతో సరి. చంద్రబాబు నాయుడు చెప్పినట్లు రైతుదగా కాదా..? జగన్ చెప్పండిఅంటూ దేవినేని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, సీఎం వైఎస్ జగన్‌కు ట్యాగ్ చేయడంతో పాటు జీవో, పేపర్ ప్రకటనలు జత చేశారు. ఈ ట్వీట్‌కు వైసీపీ నేతలు ముఖ్యంగా ఎంపీ విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే.

Updated Date - 2020-07-12T16:51:58+05:30 IST