భక్తజనసంద్రం.. యాదాద్రిక్షేత్రం

ABN , First Publish Date - 2021-12-06T00:33:26+05:30 IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం భక్తజనుల కోలాహలం నెలకొంది. వారాంతపు సెలవు రోజు

భక్తజనసంద్రం.. యాదాద్రిక్షేత్రం

యాదాద్రి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం భక్తజనుల కోలాహలం నెలకొంది. వారాంతపు సెలవు రోజు కావడంతో అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామికి నిత్యపూజా కైంకర్యాలు ఆగమశాస్త్రరీతిలో వైభవంగా జరిగాయి. వేకువజామున స్వామివారికి అభిషేకం, అర్చనలు, ఉత్సవ మండపంలో హోమ పూజలు, నిత్య కల్యాణోత్సవం, సాయంత్రం అలంకార సేవలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. స్వామి సన్నిధిలో ఆర్జిత సేవోత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బాలాలయం పరిసరాలు రద్దీ ఎక్కువగా ఉండటంతో బస చేసేందుకు సరైన ప్రాంతాలు లేక భక్తులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. స్వామికి భక్తుల నుంచి ఆదివారం రూ. 22,69,332 ఆదాయం సమకూరినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.

Updated Date - 2021-12-06T00:33:26+05:30 IST