ఇంటి నుంచి కాలు బ‌య‌ట ‌పెడితే రూ. 60వేల జ‌రిమానా !

ABN , First Publish Date - 2020-05-31T15:14:18+05:30 IST

క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తిని అరిక‌ట్టేందుకు దుబాయి స‌ర్కార్ తాజాగా క‌ఠిన చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది.

ఇంటి నుంచి కాలు బ‌య‌ట ‌పెడితే రూ. 60వేల జ‌రిమానా !

దుబాయి: క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తిని అరిక‌ట్టేందుకు దుబాయి స‌ర్కార్ తాజాగా క‌ఠిన చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా రాత్రి 11 గంట‌ల నుంచి ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు స్టేరిలైజేషన్ కార్య‌క్ర‌మం చేప‌డుతోంది. ప్ర‌స్తుతం కోవిడ్‌-19 విజృంభణ కొన‌సాగుతున్నందున దేశ ప్ర‌జ‌ల‌పై తీవ్ర ఆంక్ష‌లు విధించింది. అన‌వ‌స‌రంగా ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌స్తే 3వేల దిర్హామ్స్‌(రూ. 60వేలు) జ‌రిమానా విధిస్తామ‌ని దుబాయి పోలీసులు హెచ్చ‌రించారు. క‌ర్ఫ్యూ స‌మ‌యంలో కేవ‌లం ఆహార ప‌దార్థాలు మ‌రియు మెడిసిన్స్ కొనుగోలుకు, హెల్త్ ఎమ‌ర్జెన్సీస్‌, కీలక రంగాలకు చెందిన ఉద్యోగులకు మాత్ర‌మే అనుమ‌తి ఉంటుంద‌ని తెలిపారు. అత్యావ‌స‌రంగా బ‌య‌ట‌కు వెళ్లాల్సి ఉంటే dxbpermit.gov.ae ద్వారా అనుమ‌తి తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి అని పోలీసులు వెల్ల‌డించారు. ‌



Updated Date - 2020-05-31T15:14:18+05:30 IST