ధనలక్ష్మీ బ్యాంక్ ఎండీ, సీఈఓ ఔట్
ABN , First Publish Date - 2020-10-01T06:23:52+05:30 IST
ధనలక్ష్మీ బ్యాంక్ ఎండీ, సీఈఓగా సునీల్ గుర్బక్సానీ నియామకాన్ని బుధవారం జరిగిన ఏజీఎంలో తిరస్కరించారు...
- ఏజీఎంలో అడ్డుకున్న వాటాదారులు
న్యూఢిల్లీ: ప్రైవేటు బ్యాంకు ల డైరెక్టర్ల బోర్డులకు వాటాదారులు షాకుల మీద షాకులిస్తున్నారు. ధనలక్ష్మీ బ్యాంక్ ఎండీ, సీఈఓగా సునీల్ గుర్బక్సానీ నియామకాన్ని బుధవారం జరిగిన ఏజీఎంలో తిరస్కరించారు. దీంతో పట్టుమని ఎనిమిది నెలలు తిరక్కుండానే ధనలక్ష్మీ బ్యాంక్లో గుర్బక్సానీ పదవీ కాలం ముగిసింది. ఇందుకు సంబంధించిన తీర్మానంపై జరిగిన ఓటింగ్లో 90.49 శాతం వాటాదారులు వ్యతిరేకంగా ఓటేసినట్టు బ్యాంకు రెగ్యులేటరీ సంస్థలకు తెలిపింది. ధనలక్ష్మి బ్యాంక్ వ్యవహారాలను చ క్కదిద్దేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు ఇటీవలే ఆర్బీఐకి లేఖ రాశాయి. ఆ వెంట వెంటనే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం విశేషం.