పొడుగ్గా ఉండే గడ్డం వ్యక్తికి ధర్మం అంటే భయం: సోమువీర్రాజు
ABN , First Publish Date - 2022-01-25T17:07:49+05:30 IST
పొడుగ్గా ఉండే గడ్డం వ్యక్తికి ధర్మం అంటే భయం: సోమువీర్రాజు
అమరావతి: మధ్యాహ్నం బీజేపీ సీనియర్ నేతలు గుడివాడ వెళ్లనున్నారు. కొడాలి నాని కేసినో ఆరోపణల నిగ్గుతేల్చేందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. గుడివాడలో సంక్రాంతి ముగింపు సంబరాలు నిర్వహించి తీరుతామని సోమువీర్రాజు అన్నారు. హరిదాసులు, గంగిరెడ్డిలు, ధర్మం, సంస్కృతిని చూపిస్తామని సోమువీర్రాజు తెలిపారు. సగం వస్త్రాలు కట్టుకున్న చీర్గార్ల్స్ను తీసుకురామని, గడ్డం వ్యక్తుల దగ్గర అర్ధనగ్నంగా ఎగురుతున్నారని సోమువీర్రాజు విమర్శించారు. ధర్మం అంటే గడ్డాలు పెంచుకోవడం, చేతులకు తాళ్లు కట్టుకోవడం కాదని ఆయన మండిపడ్డారు. బట్టలు ఎలా ధరించాలో దేవుడికి కట్టే వస్త్రాలను చూసి నేర్చుకోండని సోమువీర్రాజు సూచించారు. పొడుగ్గా ఉండే గడ్డం వ్యక్తికి ధర్మం అంటే భయమని, అందుకే గుడివాడ వస్తున్నామని సోమువీర్రాజు అన్నారు.