కెప్టెన్గా ఎన్నుకున్నప్పుడే ధోనీ సత్తా మాకు తెలిసింది: పవార్
ABN , First Publish Date - 2020-08-16T05:29:36+05:30 IST
భారత క్రీడా రంగానికి టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఎనలేని సేవలు అందించాడంటూ..
ముంబై: భారత క్రీడా రంగానికి టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఎనలేని సేవలు అందించాడంటూ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కొనియాడారు. అంతర్జాతీయ క్రికెట్కు ధోనీ ఇవాళ గుడ్బై చెప్పిన నేపథ్యంలో మాజీ బీసీసీఐ ప్రెసిడెంట్ పవార్ స్పందిస్తూ... ‘‘క్రికెట్తో నాకు సుదీర్ఘ అనుబంధం ఉంది. ఎంఎస్ ధోనీని కెప్టెన్గా నియమించినప్పుడే భారత్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా నిలుస్తాడని మాకు అనిపించింది..’’ అని పేర్కొన్నారు. భారత క్రీడారంగానికి ధోని అందించిన సేవలు, నెలకొల్పిన రికార్డులు ప్రత్యేకమైనవనీ... యువతకు అవి ఎంతో స్ఫూర్తినిస్తాయని ఆయన అన్నారు. ‘‘భారత్లోని గొప్ప వికెట్ కీపర్-బ్యాట్స్మెన్, కెప్టెన్లలో ఒకడైన ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతడి భవిష్యత్తు ఆనందంగా సాగాలని కోరుకుంటున్నాను..’’ అని పవార్ ట్వీట్ చేశారు.