ధోనీ చివరి మ్యాచ్ ఆడేశాడు.. నెహ్రా షాకింగ్ కామెంట్స్!

ABN , First Publish Date - 2020-08-03T03:22:42+05:30 IST

టీమిండియా మాజీ సారధి మహేంద్రసింగ్ ధోనీ గురించి మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ధోనీ చివరి మ్యాచ్ ఆడేశాడు.. నెహ్రా షాకింగ్ కామెంట్స్!

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ సారధి మహేంద్రసింగ్ ధోనీ గురించి మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా షాకింగ్ కామెంట్స్ చేశాడు. ధోనీ ఇప్పటికే తన చివరి మ్యాచ్ సంతోషంగా ఆడేశాడని నెహ్రా అన్నాడు. ‘ధోనీ తన సత్తా నిరూపించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అతను రిటైర్‌మెంట్ ప్రకటించలేదు కాబట్టే మనం ఇంతలా దీనిపై చర్చిస్తున్నాం. ధోనీ మనసులో ఏముందో మనం చెప్పలేం కదా’ అని నెహ్రా చెప్పాడు. తన వరకైతే ధోనీ ఆటతీరు ఎప్పుడూ తడబడలేదని, అతను ఎప్పుడూ ఫామ్‌లోనే ఉన్నాడని స్పష్టంచేశాడు. భారత్ తరఫున తన చివరి మ్యాచ్‌ను ధోనీ సంతోషంగా ఆడేశాడని పేర్కొన్నాడు.

Updated Date - 2020-08-03T03:22:42+05:30 IST