మినీ యూర్పగా బీబీనగర్ ఎయిమ్స్
ABN , First Publish Date - 2021-01-21T06:48:26+05:30 IST
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ రానున్న ఐదేళ్లలో మినీ యూర్పగా అభివృద్ధి చెందనుందని డైరెక్టర్ వికాస్ భాటియా అన్నారు
డైరెక్టర్ వికాస్ భాటియా
యాదాద్రి, జనవరి 20(ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ రానున్న ఐదేళ్లలో మినీ యూర్పగా అభివృద్ధి చెందనుందని డైరెక్టర్ వికాస్ భాటియా అన్నారు. క్యాంప్సలో బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖను ఆయన ప్రారంభించారు. 210 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న ఎయిమ్స్ క్యాంప్సలో.. ముంబై తరహాలో 25 అంతస్తుల టవర్ల నిర్మాణం చేపట్టనున్నట్లు భాటియా తెలిపారు. 40సూపర్ స్పెషాలిటీ విభాగాలు ఉంటాయన్నారు. వెయ్యి మంది వైద్యులు, 5వేల మంది సిబ్బంది సేవలు అందిస్తారని చెప్పారు. కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విక్రం ఆదిత్యసింగ్, ఎయిమ్స్ వైద్యాధికారులు పాల్గొన్నారు.