రోగ నిరోధక శక్తి కోసం హోమియో దోహదం
ABN , First Publish Date - 2020-07-14T09:04:41+05:30 IST
కరోనా కట్టడికి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు హోమియోపతి మందులు
- హోమియో ఇమ్యూనిటీ కిట్ ఆవిష్కరించిన మంత్రి హరీశ్
- ఎంపీ బీబీ పాటిల్ ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ
హైదరాబాద్, జూలై 13 (ఆంధ్రజ్యోతి): కరోనా కట్టడికి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు హోమియోపతి మందులు దోహద పడతాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేసే హోమియో ఇమ్యూనిటీ కిట్ను సోమవారం మంత్రి హరీశ్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అత్యవసరమైన పనులు ఉంటే తప్ప ఎవరూ బయటకు రావొద్దని, మాస్కు తప్పనిసరిగా ధరించాలని విజ్ఞప్తి చేశారు. రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు హోమి యోపతి మందులు వాడాలని సూచించారు. బీబీ పాటిల్ మాట్లాడుతూ... తన నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఈ మందులు అందరికీ అందేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, క్రాంతి కిరణ్, సీఎంఎస్ చైర్మన్ శివకుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు