ముస్లింలకు రంజాన్‌ కిట్ల పంపిణీ

ABN , First Publish Date - 2020-05-20T10:22:55+05:30 IST

సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామంలో మంగళవారం ముస్లీంలకు రంజాన్‌ కిట్లను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పంపిణీ చేశారు.

ముస్లింలకు రంజాన్‌ కిట్ల పంపిణీ

సత్తుపల్లి, మే19: సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామంలో మంగళవారం ముస్లీంలకు రంజాన్‌ కిట్లను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత సామరస్యానికి సోదర భావానికి రంజాన్‌ పండుగ స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.


సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమం కోసం పనిచేస్తుందని అన్నారు. ముస్లింలు రంజాన్‌ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆత్మ చైర్మన్‌ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, ఎంపీపీ దొడ్డా హైమావతి శంకరరావు, సర్పంచ్‌ కంచర్ల రమాదేవి నాగేశ్వరరావు, ఎంపీటీసీ నాగార్జున పుష్పావతి, ఉప సర్పంచ్‌ పెద్దిరాజుతో పాటు నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-20T10:22:55+05:30 IST