ప్రచారం చేయండి ప్లీజ్.. మోదీకి డీఎంకే అభ్యర్థుల వింత డిమాండ్!

ABN , First Publish Date - 2021-04-02T21:25:01+05:30 IST

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్న డీఎంకే అభ్యర్థులు ప్రధాని నరేంద్ర మోదీ ముందు ఇవాళ వింత ప్రతిపాదన పెట్టారు.....

ప్రచారం చేయండి ప్లీజ్.. మోదీకి డీఎంకే అభ్యర్థుల వింత డిమాండ్!

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్న డీఎంకే అభ్యర్థులు ప్రధాని నరేంద్ర మోదీ ముందు ఇవాళ వింత ప్రతిపాదన పెట్టారు. తమ నియోజక వర్గాల్లో అన్నాడీఎంకే- మిత్రపక్షాల తరపున మోదీ ప్రచారం చేయాలంటూ వారు కోరారు. అలా చేస్తే తమ విజయావకాశాలు మరింత పెరుగుతాయంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ట్విటర్లో డీఎంకే అభ్యర్థి ఆర్ఎస్ రాజకన్నప్పన్ స్పందిస్తూ... ‘‘ప్రధానమంత్రిగారూ... దయచేసి మా నియోజకవర్గంలో ప్రచారం చేయండి. నేను ఇక్కడ డీఎంకే అభ్యర్థిని. మీరు ఇక్కడ ప్రచారం చేస్తే నా గెలుపు అవకాశాలు మరింత పెరుగుతాయి. థాంక్యూ సర్..’’ అని పేర్కొన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తగా బీజేపీ క్లీన్ స్వీప్ చేసినప్పటికీ.. తమిళనాడులో మాత్రం ఆ పార్టీకి దారుణ పరాభవం ఎదురైంది. ఇక్కడ మొత్తం 39 లోక్‌సభ స్థానాలు ఉండగా డీఎంకే, మిత్రపక్షాలు 38 స్థానాలు గెలుచుకున్నాయి. తాజాగా ఈ నెల 6న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా డీఎంకే, దాని మిత్రపక్షాల నేతలు మోదీ వ్యతిరేక ప్రచారంతోనే దూసుకెళ్తున్నారు. 

Updated Date - 2021-04-02T21:25:01+05:30 IST