అందరి ముందు నిందించొద్దు!

ABN , First Publish Date - 2020-10-25T05:30:00+05:30 IST

పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లితండ్రులు మందలించడం మామూలే. అయితే కొందరు పేరెంట్స్‌ అందరిముందూ తమ పిల్లలను తిట్టడం, వారిపై గట్టిగా అరవడం చేస్తుంటారు. అందరి ముందూ వారిస్తే అయినా బుద్దిగా ఉంటారని భావిస్తారు తల్లితండ్రులు...

అందరి ముందు నిందించొద్దు!

పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లితండ్రులు మందలించడం మామూలే. అయితే కొందరు పేరెంట్స్‌ అందరిముందూ తమ పిల్లలను తిట్టడం, వారిపై గట్టిగా అరవడం చేస్తుంటారు. అందరి ముందూ వారిస్తే అయినా బుద్దిగా ఉంటారని భావిస్తారు తల్లితండ్రులు. కానీ దాని ప్రభావం పిల్లల మీద చాలా ఉంటుంది. కాబట్టి తల్లితండ్రులు ఈ అలవాటును వీలైనంత తొందరగా మానేయాలి. ఎందుకంటే.... పిల్లల మనసు తెల్లకాగితం లాంటిది. వారు ఏది చూస్తారో అదే వారి మనసులో బలంగా నాటుకుపోతుంది.


నలుగురిలో పిల్లలను పదేపదే తప్పు పట్టడం, తిట్టడం వల్ల వారు అవమానంగా భావిస్తారు. తమ తోటి పిల్లలతో వారు కూడా అదేవిధంగా ప్రవర్తించే అవకాశముంది. అంతేకాదు తమలోని కోపాన్ని ఏదో రూపంలో బయటకు వెళ్లగక్కడం అలవాటు చేసుకుంటారు. పేరెంట్స్‌ ప్రతి చిన్నదానికి నలుగురి ముందు తిడుతూ ఉంటే పిల్లలు చాలా విషయాలు దాస్తారు. ఒక్కోసారి ఎదురు సమాధానం చెబుతుంటారు. అందుచేత పిల్లలు పెద్ద పొరపాటు చేసినా కూడా వారిని అందరి ముందు నిందించొద్దు. తల్లితండ్రులు పిల్లల మీద నమ్మకం ఉంచాలి. ఒకసారి చేసిన తప్పు మళ్లీ చేయకూడదని పిల్లలకు తెలిసేలా చేయాలి. అందుకోసం పేరెంట్స్‌ పిల్లలకు నెమ్మదిగా నచ్చజెప్పాలి. వారిని ఒంటరిగా పిలిచి మందిలించాలి. ఇలా చేయడం వల్ల వారు సరైన దారిలో నడించేందుకు బాటలు వేసినవారవుతారు.

Updated Date - 2020-10-25T05:30:00+05:30 IST