డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్... త్రైమాసిక ఆర్థిక ఫలితాల విడుదల
ABN , First Publish Date - 2021-07-27T21:49:51+05:30 IST
ఈ ఏడాది జూన్ 30 తో ముగిసిన తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ విడుదల చేసింది.
హైదరాబాద్ : ఈ ఏడాది జూన్ 30 తో ముగిసిన తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ విడుదల చేసింది. కాగా... కంపెనీ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు... అంచనాలను అందుకోలేకపోయాయి. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే కంపెనీ నికరలాభం ఒకశాతం క్షీణతతో రూ. 570.80 కోట్లకు తగ్గింది.
ఇక కంపెనీ మొత్తం ఆదాయం 11 శాతం క్షీణతతో రూ. 4,919 కోట్లకు పడిపోయింది. ఎబిటా 12.3శాతం క్షీణతతో రూ. 1,019 కోట్లుగా నమోదైంది. ఎబిటా మార్జిన్ గతేడాది ఇదే సమయంలో 26.3శాతం నమోదు కాగా, జూన్ త్రైమాసికంలో ఇది 20.7శాతానికి పరిమితమైంది.