Drunken Driveలో తొమ్మిది మందికి జరిమానా

ABN , First Publish Date - 2022-01-07T12:25:59+05:30 IST

పట్టణంలో ఇటీవల నిర్వహించిన వాహన తనిఖీల్లో తొమ్మిది మంది మద్యం తాగి డ్రైవింగ్‌ చేస్తూ పట్టుబడగా, వారికి న్యాయమూర్తి జరిమానా విధించినట్టు

Drunken Driveలో తొమ్మిది మందికి జరిమానా

సిద్దిపేట: పట్టణంలో ఇటీవల నిర్వహించిన వాహన తనిఖీల్లో తొమ్మిది మంది  మద్యం తాగి డ్రైవింగ్‌ చేస్తూ పట్టుబడగా, వారికి న్యాయమూర్తి జరిమానా విధించినట్టు పోలీసులు గురువారం తెలిపారు. వివరాల్లోకి వెళ్తే పట్టణంలోని నర్సాపూర్‌ చౌరస్తా, ఎంపీడీవో ఆఫీస్‌ చౌరస్తా,  రాజీవ్‌ రహదారిపై నాలుగు రోజులుగా సిద్దిపేట ట్రాఫిక్‌ సీఐ రాజశేఖర్‌, ట్రాఫిక్‌ ఆర్‌ఐ శ్రీధర్‌రెడ్డి, ట్రాఫిక్‌ ఎస్‌ఐ షకీల్‌ హైమద్‌, ఆర్‌ఎ్‌సఐ సాయి ప్రసాద్‌ తదితరులు సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో 9 మంది డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో పట్టుబడినట్టు తెలిపారు. గురువారం వారిని సిద్దిపేట ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి రమే్‌షబాబు ఎదుట  హాజరుపరచగా విచారణ విచారణ అనంతరం అందరికి రూ.23వేల జరిమానా విధించారు. 

Updated Date - 2022-01-07T12:25:59+05:30 IST