మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-01-17T04:11:02+05:30 IST
మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య
షాద్నగర్ రూరల్: మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చటాన్పల్లి శివారు రాంనగర్ కాలనీలో ఉండే నరేష్(50) తాపీ మేస్త్రీగా పనిచేసేవాడు. మద్యానికి బానిసై రోజూ కుటుంబీకులతో గొడవపడేవాడు. శుక్రవారం రాత్రి కూడా మద్యానికి డబ్బులు కావాలని ఇంట్లో వారితో గొడవపడ్డాడన్నారు. అదే రాత్రి ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు వివరించారు.