Dwaraka tirumala నిత్యాన్నదాన ట్రస్ట్ విరాళంలో పొరపాటు
ABN , First Publish Date - 2022-06-11T14:40:07+05:30 IST
ద్వారకా తిరుమల దేవస్థానం నిత్యాన్నధాన ట్రస్ట్ విరాళంలో పొరపాటు చోటు చేసుకుంది.
ఏలూరు: ద్వారకా తిరుమల దేవస్థానం నిత్యాన్నధాన ట్రస్ట్ విరాళంలో పొరపాటు చోటు చేసుకుంది. నిత్యాన్నదాన ట్రస్ట్కు ఓ భక్తులు రూ.2116లు చెల్లించాడు. కాగా ఆలయ ఉద్యోగి ఆ మొత్తాన్ని ఆన్లైన్లో రూ.8 కోట్లుగా ఎంటర్ చేశాడు. అమౌంట్ టైప్ చేయాల్సిన చోట సదరు ఉద్యోగి పొరబాటున ఆధార్ నెంబర్ టైప్ చేశాడు. దీంతో ఆన్లైన్లోని అమౌంట్లలో తేడాలు రావడంతో ఆలయ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.