పవన్ విజ్ఞప్తిపై స్పందించిన తమిళనాడు సీఎం

ABN , First Publish Date - 2020-03-30T20:19:51+05:30 IST

ఏపీ మత్స్యకారులను ఆదుకోవాలంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన విజ్ఞప్తిపై తమిళనాడు సీఎం ఈకే పళనిస్వామి స్పందించారు.

పవన్ విజ్ఞప్తిపై స్పందించిన తమిళనాడు సీఎం

చెన్నై: ఏపీ మత్స్యకారులను ఆదుకోవాలంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన విజ్ఞప్తిపై తమిళనాడు సీఎం ఈకే పళనిస్వామి స్పందించారు. సంబంధిత శాఖకు దీనిపై ఆదేశాలు జారీ చేస్తామని.. వారిని జాగ్రత్తగా చూసుకుంటామని ట్విట్టర్ వేదికగా హామీ ఇచ్చారు. తమ దృష్టికి తీసుకొచ్చినందుకు పవన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 


ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం సీహెచ్ చొలగండి గ్రామానికి చెందిన సుమారు 30 మంది మత్స్యకారులు చేపల వేట కోసం తమిళనాడు వెళ్లారు. లాక్‌డౌన్ కారణంగా చెన్నై హార్బర్‌ దగ్గర చిక్కుకుపోయారు. ఈ విషయం తమ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. వారిని ఆదుకోవాలంటూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రి ఈకే పళనిస్వామిలను ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. పళనిస్వామికి తమిళంలో ప్రత్యేకంగా మరో ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన పళని..  వారి బాగోగులు చూసుకుంటామని ట్విట్టర్ ద్వారా తెలిపారు. మరోవైపు ఏపీ సీఎంవో నుంచి ఇప్పటి వరకు కనీస స్పందన లేకపోవడంపై నెట్టింట విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  



Updated Date - 2020-03-30T20:19:51+05:30 IST