సమర్థంగా విద్యుత్తు వ్యవస్థల నిర్వహణ

ABN , First Publish Date - 2020-10-22T07:19:01+05:30 IST

భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ విద్యుత్తు వ్యవస్థలను సమర్థంగా నిర్వహిస్తున్నామని, యుద్ధప్రాతిపదికన కరెంటు పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని ట్రాన్స్‌కో,

సమర్థంగా విద్యుత్తు వ్యవస్థల నిర్వహణ

యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు

ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు

హైదరాబాద్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ విద్యుత్తు వ్యవస్థలను సమర్థంగా నిర్వహిస్తున్నామని, యుద్ధప్రాతిపదికన కరెంటు పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్తు సరఫరా పరిస్థితిపై అధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.


రాష్ట్రవ్యాప్తంగా, ప్రధానంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో వర్షాల వల్ల అనేక విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్లు, హెచ్‌టీ లైన్లు దెబ్బతిన్నాయని, అనేకచోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగిందన్నారు. అనేక భవన సముదాయాల్లో ఇంకా వరద నీరు నిలిచి ఉండటం వల్ల.. ఆయా భవనాల్లో సరఫరా పునరుద్ధరణ సవాలుగా మారిందని చెప్పారు.  సంస్థల వారీగా విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ చర్యలు తీసుకోవడానికి ఏరియా నోడల్‌ అధికారులను నియమించామని ఆయన తెలిపారు.   


Updated Date - 2020-10-22T07:19:01+05:30 IST