విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న Car: ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2021-11-27T16:13:15+05:30 IST

తూత్తుకుడి జిల్లా కోవిల్‌పట్టి వద్ద శుక్రవారం వేకువజామున అదుపుతప్పిన కారు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మదురై కరిమేడు ప్రాంతంలో నివసిస్తున్న

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న Car: ఇద్దరి మృతి

చెన్నై: తూత్తుకుడి జిల్లా కోవిల్‌పట్టి వద్ద శుక్రవారం వేకువజామున అదుపుతప్పిన కారు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మదురై కరిమేడు ప్రాంతంలో నివసిస్తున్న ట్రావెలర్స్‌ సంస్థ సూపర్‌వైజర్‌ హరిబాబు (44) గురువారం రాత్రి తన స్నేహితులు మురుగన్‌ (54), రఘునాథన్‌ (39), గోపాల్‌ (40)తో కలిసి అంబై అనే చోట ఉన్న ట్రావెలర్స్‌ సంస్థలో వాహనాలను పరిశీలన జరిపేందుకు కారులో వెళ్ళారు. ఆ కారు తూత్తుకుడి జిల్లా కోవిల్‌పట్టి సమీపం ఇడైసెవల్‌ బస్టాపు సమీపంలో వెళుతుండగా అదుపు తప్పి రోడ్డు పక్కగా ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్నది. ఈ సంఘటనలో కారు రెండు ముక్కలై నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో గోపాల్‌, మురుగన్‌ తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కోవిల్‌పట్టి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారు శిథిలాల మధ్య చిక్కుకుని తీవ్రంగా గాయపడిన హరి, రఘునాథన్‌ను చికిత్స నిమిత్తం కోవిల్‌పట్టి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2021-11-27T16:13:15+05:30 IST