లాక్‌డౌన్ తర్వాత పెరిగిన ఎలక్ట్రానిక్స్ వినియోగం

ABN , First Publish Date - 2021-03-16T21:41:03+05:30 IST

లాక్‌డౌన్ అనంతరం దేశంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల వినియోగం పెరిగిందని ప్రముఖ ఈ కామర్స్ సంస్త ఉడాన్ పేర్కొంది. గత ఏడాది తమ సంస్థ దాదాపు 160 మిలియన్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను విక్రయించినట్లు తెలిపింది.

లాక్‌డౌన్ తర్వాత పెరిగిన ఎలక్ట్రానిక్స్ వినియోగం

లాక్‌డౌన్ అనంతరం దేశంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల వినియోగం పెరిగిందని ప్రముఖ ఈ కామర్స్ సంస్త ఉడాన్ పేర్కొంది. గత ఏడాది తమ సంస్థ దాదాపు 160 మిలియన్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను విక్రయించినట్లు తెలిపింది. కరోనా మహమ్మారి కారణంగా అధిక శాతం మంది వర్క్‌ఫ్రమ్ హోం అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారని, అందువల్లే ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, అస్సాం, బీహార్‌ లాంటి రాష్ట్రాల నుంచి ఎలక్రానిక్ ఉత్పత్తులకు అధికంగా ఆర్డర్స్ వచ్చినట్లు ఉడాన్ వివరించింది. అన్‌లాక్ తర్వాత ఎలక్ట్రానిక్స్ వాడకం మరింత పెరిందని తెలిపింది. కేవలం 3 నెలల్లోనే 50 మిలియన్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తమ సంస్థ ద్వారా కొనుగోలు అయ్యాయని ఉడాన్‌ ఎలక్ట్రానిక్స్‌ హెడ్‌ హృఫికేష్‌ థిటే తెలిపారు.

Updated Date - 2021-03-16T21:41:03+05:30 IST