శిరోముండనం బాధితుడి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన డీఐజీ
ABN , First Publish Date - 2020-08-11T18:14:51+05:30 IST
తూర్పు గోదావరి జిల్లా సీతానగరం శిరోముండనం బాధితుడు మావోయిస్టులలో తనను చేర్చుకోండి అంటూ పెట్టిన అర్జీపై ఏలూరు రేంజ్ డీఐజీ ఎ మోహనరావు తీవ్రంగా స్పందించారు.
ఏలూరు: తూర్పు గోదావరి జిల్లా సీతానగరం శిరోముండనం బాధితుడు మావోయిస్టులలో తనను చేర్చుకోండి అంటూ పెట్టిన అర్జీపై ఏలూరు రేంజ్ డీఐజీ ఎ మోహనరావు తీవ్రంగా స్పందించారు. శిరోముండనం చేయించిన ఎస్ఐ, కానిస్టేబుల్పై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశామని తెలిపారు. బాధితుడు వరప్రసాద్కు పోలీసు రక్షణ కల్పించామని చెప్పారు. కొంతమంది నాయకులు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చట్ట వ్యతిరేక కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. చట్ట విరుద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆ వ్యాఖ్యలు చేసే వారి వెనుక ఎవరు ఉన్నారో తమకు తెలుసన్నారు. కొంతమంది లేని అంశాలను సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఏలూరు రేంజ్ డీఐజీ మోహన్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.