సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది.. కుటుంబ సభ్యులను కలుసుకున్నారు!

ABN , First Publish Date - 2020-07-13T17:34:54+05:30 IST

షీనా సలీమ్.. యూఏఈలోని ఓ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తున్నారు. విశ్రాంతి కోసం ఈ ఏడాది మార్చి 14న కేరళకు వచ్చారు. సరిగ్గా అదే సమయంలో

సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది.. కుటుంబ సభ్యులను కలుసుకున్నారు!

యూఏఈ: షీనా సలీమ్.. యూఏఈలోని ఓ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తున్నారు. విశ్రాంతి కోసం ఈ ఏడాది మార్చి 14న కేరళకు వచ్చారు. సరిగ్గా అదే సమయంలో ఇండియాలో కరోనా వైరస్ విజృంభణ మొదలైంది. దీంతో భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో ఆమె ఇక్కడే చిక్కుకున్నారు. 


అనుపమ్ నైర్.. దుబాయ్‌కి చెందిన బేస్ బ్యాండ్‌లో సింగర్. ఢిల్లీలో ప్రోగ్రామ్ ఉండటంతో మార్చిలో ఇండియాకు వచ్చారు. లాక్‌డౌర్ కారణంగా ఇక్కడే చిక్కుకున్నారు. అయితే చార్టెడ్ విమానాల్లో యూఏఈకి దుబాయికి వెళ్లడానికి ప్రయత్నించారు. కానీ అర్ధాంతరంగా అవి రద్దు కావడంతో చేసేది ఏం లేక ఇక్కడే ఉండిపోయారు.ఇలా వివిధ కారణాల వల్ల ఇండియాకు వచ్చి, లాక్‌డౌన్ కారణంగా ఇక్కడే చిక్కుకున్న యూఏఈ రెసిడెంట్స్‌లో కొందరు నిన్న తిరిగి యూఏఈకి చేరుకున్నారు. దాదాపు మూడు, నాలుగు నెలల సుదీర్ఘమైన నిరీక్షణ తర్వాత తమ కుటుంబ సభ్యులను కలుసుకుని ఉద్వేగానికి లోనయ్యారు. ఇందుకు షార్జా, దుబాయిలోని అంతర్జాతీయ విమానాశ్రయాలు వేదికయ్యాయి. కాగా.. లాక్‌డౌన్ కారణంగా ఇండియాలో చిక్కుకున్న యూఏఈ నివాసితుల కోసం.. ‘వందే భారత్ మిషన్’లో భాగంగా 15 రోజులపాటు యూఏఈకి ప్రత్యేక విమానాలు నడపనున్నట్లు భారత పౌర విమానయానశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం రోజు కొందరు యూఏఈ రెసిడెంట్స్ ఇండియా నుంచి తరలి వెళ్లారు. 


Updated Date - 2020-07-13T17:34:54+05:30 IST