ఏపీ దిశ బిల్లులో లోపాలు: కేంద్రం
ABN , First Publish Date - 2021-12-02T01:52:30+05:30 IST
ఏపీ ప్రభుత్వ పంపిన దిశ బిల్లులో కొన్ని లోపాలున్నాయని
ఢిల్లీ: ఏపీ ప్రభుత్వ పంపిన దిశ బిల్లులో కొన్ని లోపాలున్నాయని కేంద్ర సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా తెలిపారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీ పరిమళ నత్వానీ అడిగిన ప్రశ్నకు ఏకే మిశ్రా సమాధానం ఇచ్చారు. దిశ బిల్లుపై ఏపీని వివరణ కోరామన్నారు. ఏపీ నుంచి ఇంకా వివరణ రాలేదని ఆయన పేర్కొన్నారు. వచ్చిన తర్వాత పరిశీలించి రాష్ట్రపతి ఆమోదానికి పంపుతామని ఆయన తెలిపారు.