ఈఎస్ఐ స్కామ్లో మరొకరి అరెస్ట్
ABN , First Publish Date - 2020-07-04T04:01:57+05:30 IST
ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల స్కామ్లో కార్తీక్ అనే వ్యక్తిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. తిరుమల మెడికల్ ఏజెన్సీ పేరుతో మందులు సరఫరా చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
అమరావతి: ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల స్కామ్లో కార్తీక్ అనే వ్యక్తిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. తిరుమల మెడికల్ ఏజెన్సీ పేరుతో మందులు సరఫరా చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. నకిలీ కొటేషన్లు సమర్పించారని సీబీఐ అతనిపై అభియోగం మోపింది. మరో సంస్థ పేరుతో వారికి తెలియకుండానే కొనుగోలు ఆర్డర్లు ఇచ్చారని పేర్కొన్నారు. అధిక ధరలకు మందులు కోడ్ చేసి నిధులు దుర్వినియోగం చేసినట్లు తేల్చారు. ఈఎస్ఐ డైరెక్టర్ రమేష్ కుమార్, సిబ్బందితో కలిసి ఈ స్కామ్ చేసినట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. అధికారులు కార్తిక్ను విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు అతనికి 16 రోజుల రిమాండ్ విధించింది.