విశ్వాసాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తా: ఈటల

ABN , First Publish Date - 2021-06-14T18:46:05+05:30 IST

విశ్వాసాన్ని వమ్ము చేయకుండా తెలంగాణ ప్రజల కోసం పని చేస్తానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

విశ్వాసాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తా: ఈటల

న్యూఢిల్లీ: విశ్వాసాన్ని వమ్ము చేయకుండా తెలంగాణ ప్రజల కోసం పని చేస్తానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఈటల బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీని అన్ని గ్రామాలకు తీసుకొని వెళ్ళడానికి శ్రమిస్తానని తెలిపారు. దక్షిణ భారత దేశంలో తెలంగాణలో బీజేపీని విస్తరించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నానికి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. బీజేపీలోకి స్వాగతం పలికి పార్టీలో చేర్చుకున్న నాయకులందరికీ ఈటల రాజేందర్ ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2021-06-14T18:46:05+05:30 IST