భార‌త్‌లోని ఏడు న‌గ‌రాల‌కు ఎతిహాద్‌ విమాన స‌ర్వీసులు...

ABN , First Publish Date - 2020-07-02T17:17:49+05:30 IST

అబుధాబికి చెందిన ప్ర‌ముఖ‌ ఎయిర్‌లైన్స్ ఎతిహాద్ ఈ నెల 16 నుంచి భార‌త్‌లోని ఏడు న‌గ‌రాల‌కు విమాన స‌ర్వీసులు న‌డిపేందుకు సిద్ధ‌మ‌వుతోంది.

భార‌త్‌లోని ఏడు న‌గ‌రాల‌కు ఎతిహాద్‌ విమాన స‌ర్వీసులు...

అబుధాబికి చెందిన ప్ర‌ముఖ‌ ఎయిర్‌లైన్స్ ఎతిహాద్ ఈ నెల 16 నుంచి భార‌త్‌లోని ఏడు న‌గ‌రాల‌కు విమాన స‌ర్వీసులు న‌డిపేందుకు సిద్ధ‌మ‌వుతోంది. కొత్త‌గా 15 గమ్య‌స్థానాల‌కు విమాన స‌ర్వీసులు ప్ర‌క‌టించిన ఎతిహాద్... వీటిలో 7 ఇండియాలో ఉన్న‌ట్లు తెలిపింది. గ‌త నెల‌లో ఏథెన్స్‌, గ్రీస్‌తో పాటు 25 గ‌మ్య‌స్థానాల‌కు ఫ్లైట్స్ న‌డిపిన ఎతిహాద్‌.. జూలైలో మ‌రో 15 కొత్త విమాన స‌ర్వీసుల‌తో క‌లిపి ప్ర‌పంచ‌వ్యాప్తంగా మొత్తం 40 గ‌మ్య‌స్థానాల‌కు విమానాలు న‌డిపేందుకు రెడీ అవుతోంది. ఈ నెల 16 నుంచి ఇండియాలోని బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కొచ్చి, కోజికోడ్, ముంబైల‌కు ఎతిహాద్ విమాన స‌ర్వీసులు న‌డ‌ప‌నుంది. అలాగే పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్‌... మాల్దీవులు, అమ్మాన్, కైరో, బెల్గ్రేడ్, ఇస్తాంబుల్, మాంచెస్టర్, మ్యూనిచ్, డ్యూసెల్డార్ఫ్ గ‌మ్య‌స్థానాలు కూడా ఎతిహాద్ జాబితాలో ఉన్నాయి.    

Updated Date - 2020-07-02T17:17:49+05:30 IST