భౌతిక దూరం పాటిస్తూ అందరు జాగ్రత్తగా ఉండాలి: బాలయ్య
ABN , First Publish Date - 2020-05-28T15:02:13+05:30 IST
దురదృష్టవశాత్తు కరోనా వైరస్ వచ్చిందని, అందరూ..
హైదరాబాద్: దురదృష్టవశాత్తు కరోనా వైరస్ వచ్చిందని, అందరూ సామాజిక దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. గురువారం ఆయన ఎన్టీఆర్ ఘాట్లో పుష్పగుచ్ఛములుంచి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ అందరూ లాక్ డౌన్ నిబంధలు పాటిస్తూ, వైద్యుల సూచనలను తూ.చ. తప్పకుండా పాటించాలన్నారు.
దివంగత ఎన్టీ రామారావు ముందు చూపుతో ఆలోచించేవారని, ఇవాళ రాష్ట్రం సుభిక్షంగా ఉందంటే అందుకే ఎన్టీఆర్ చేసిన అభివృద్ది కార్యక్రమాలేనని బాలకృష్ణ అన్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి, తెలుగు గంగ ఇవన్నీ ఎన్టీఆర్ మానసపుత్రికలని, ఇలా ఎన్నో కార్యక్రమాలు ముందు చూపుతో చేశారని, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. ఎన్టీఆర్ను స్ఫూర్తిగా తీసుకుని అందరం ముందుకెళ్లాలని బాలయ్య పిలుపు ఇచ్చారు.