ఆక్వా సీడ్, ఫిష్ఫీడ్ లైసెన్స్ల జారీకి గడువు పెంపు
ABN , First Publish Date - 2021-06-22T09:09:57+05:30 IST
రాష్ట్రంలో ఆక్వా సీడ్, ఫిష్ఫీడ్ వ్యాపారులు తమ లైసెన్సుల రెన్యూవల్స్, కొత్త లైసెన్సుల కోసం జూలై1 నుంచి అక్టోబరు 31వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది
అమరావతి, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆక్వా సీడ్, ఫిష్ఫీడ్ వ్యాపారులు తమ లైసెన్సుల రెన్యూవల్స్, కొత్త లైసెన్సుల కోసం జూలై1 నుంచి అక్టోబరు 31వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గతంలో ఫిబ్రవరి5నుంచి నాలుగు నెలల్లోగా దరఖాస్తు చేసుకోవాలని గడువు నిర్ధేశించగా, కోవిడ్ కారణంగా దరఖాస్తులు, లైసెన్సుల ప్రక్రియ పూర్తి కానుందన గడువును పెంచినట్లు తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.