ఏపీలో రోడ్డు టాక్స్ కట్టేందుకు గడువు పెంపు

ABN , First Publish Date - 2020-07-31T17:47:32+05:30 IST

రోడ్డు టాక్స్ కట్టేందుకు గడువు పెంచాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.

ఏపీలో రోడ్డు టాక్స్ కట్టేందుకు గడువు పెంపు

అమరావతి: రోడ్డు టాక్స్ కట్టేందుకు గడువు పెంచాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. కరోనా నేపథ్యంలో రోడ్డు టాక్స్ కట్టేందుకు ఇచ్చిన గడువు శుక్రవారంతో ముగియనుంది. లాక్ డౌన్ కారణంగా నష్టాల్లో ఉన్న ఆటో, టాక్సీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి పేర్ని నాని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రి విజ్ఞప్తితో రోడ్డు టాక్స్ గడువు సెప్టెంబర్ నెలాఖరు వరకు పెంచుతూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఇవాళ సాయంత్రం అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.

Updated Date - 2020-07-31T17:47:32+05:30 IST