పారా ఒలింపిక్ విజేతలకు హరియాణా సర్కారు నజరానా!

ABN , First Publish Date - 2021-09-04T17:20:47+05:30 IST

టోక్యో ఒలింపిక్స్‌ షూటింగ్ విభాగంలో...

పారా ఒలింపిక్ విజేతలకు హరియాణా సర్కారు నజరానా!

ఫరీదాబాద్: టోక్యో ఒలింపిక్స్‌ షూటింగ్ విభాగంలో పీ4 మిస్డ్ 50 మీటర్ పిస్టల్ ఎస్‌హెచ్ వన్‌లో స్వర్ణ పతకాన్ని అందుకున్న మనీష్ నర్వాలాకు రూ.6 కోట్లు, రజత పతకాన్ని దక్కించుకున్న సింగరాజ్‌కు రూ.4 కోట్లు కానుకగా అందజేయనున్నట్లు హరియాణా సర్కారు ప్రకటించింది. హరియాణా ప్రభుత్వం ఈ ఇద్దరు క్రీడాకారులను అభినందిస్తూ ఈ ప్రకటన చేసింది. 19 ఏళ్ల నర్వాలా పారా ఒలింపిక్‌ రికార్డులను కొల్లగొడుతూ 218.2 స్కోరు చేశారు. ఇదేవిధంగా సింగరాజ్ 216.7 స్కోరు సాధించి, రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు. వీరిద్దరూ హరియాణాలోని ఫరీదాబాద్‌కు చెందినవారు.

Updated Date - 2021-09-04T17:20:47+05:30 IST