కమలాపూర్ పీఎస్లో ఎస్సై ముందు రైతు ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2021-01-27T19:36:39+05:30 IST
వరంగల్ అర్బన్: కమలాపూర్ పోలీస్ స్టేషన్లో ఎస్సై ముందు ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన
వరంగల్ అర్బన్: కమలాపూర్ పోలీస్ స్టేషన్లో ఎస్సై ముందు ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సివిల్ తగాదా విషయంలో కమలాపూర్ పోలీస్ స్టేషన్లో ఘటన చోటు చేసుకుంది. మర్రిపల్లి గ్రామానికి చెందిన కుందూరు శ్రీనివాసరెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే స్పందించిన ఎస్సై.. శ్రీనివాసరెడ్డిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.