తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గాయి

ABN , First Publish Date - 2021-07-28T00:39:35+05:30 IST

తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గాయని లోక్ సభలో కేంద్రం ఆమోదించిన గణాంకాలు

తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గాయి

ఢిల్లీ: తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గాయని లోక్ సభలో కేంద్రం ఆమోదించిన గణాంకాలు వెల్లడించాయి. ఎంపీ కృష్ణన్ పాల్ యాదవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. రికార్డుల ప్రకారం 2017లో 846 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన తెలిపారు. 2018లో ఆత్మహత్యలు 900కు పెరిగాయని ఆయన పేర్కొన్నారు. 2019లో రైతు ఆత్మహత్యలు 491కి తగ్గాయని మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-07-28T00:39:35+05:30 IST