అమరావతి నాశనమే ధ్యేయంగా పాలన

ABN , First Publish Date - 2021-06-19T09:13:50+05:30 IST

అమరావతిని నాశనం చేయటమే ధ్యేయంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని రైతులు, మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగాలని రైతులు, రైతు కూలీలు, మహిళలు చేస్తున్న ఉద్యమం

అమరావతి నాశనమే ధ్యేయంగా పాలన

549వ రోజు దీక్షల్లో రాజధాని రైతులు, మహిళలు


తుళ్లూరు, జూన్‌ 18: అమరావతిని నాశనం చేయటమే ధ్యేయంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని రైతులు, మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగాలని రైతులు, రైతు కూలీలు, మహిళలు చేస్తున్న ఉద్యమం శుక్రవారంతో 549వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు ముక్కలాటతో అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేయాలని సీఎం జగన్‌రెడ్డి చూస్తున్నారన్నారు. పాలకులు మారితే రాజధాని మారదన్నారు. తాము చేసే ఉద్యమం ధర్మబద్ధమైనదని, న్యాయమైనదని, పాలకులే అన్యాయంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతుంటే అణగదొక్కారన్నారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది.

Updated Date - 2021-06-19T09:13:50+05:30 IST