ప.గో. జిల్లాలో బీజేపీ నేతల ఉపవాస దీక్ష

ABN , First Publish Date - 2020-05-26T20:43:27+05:30 IST

తిరుమల శ్రీవారి భూములు కాపాడాలంటూ బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు..

ప.గో. జిల్లాలో బీజేపీ నేతల ఉపవాస దీక్ష

ప.గో.జిల్లా: తిరుమల శ్రీవారి భూములు కాపాడాలంటూ బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు ఆ పార్టీ నేతలు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా  ఉపవాస దీక్షలు చేపట్టారు. అందులో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో బీజేపీ నేతలు ఉపవాస దీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం టీటీడీ ఆస్తులను వేలం వేయాలని చూస్తోందని, అయితే తమ ఆందోళన తర్వాత ప్రభుత్వం ఉత్తర్వులను నిలుపుదల చేసిందన్నారు. తమకు కావాల్సింది నిలుపుదల కాదని, పూర్తిగా ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. 


అలాగే సింహాచలంలో వందలాది ఎకరాల భూములు ఆక్రమణకు గురయ్యాయని, ఆ భూములను వెనక్కి తీసుకుని, ఆక్రమణదారులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. దాతలు ఇచ్చిన ఆస్తులు స్వామివారి కోసమే వినియోగించాలని దాతలు కోరుకుంటారన్నారు. దానికి వ్యతిరేకంగా ఆస్తులు అమ్మకానికి పెట్టడం సరికాదని బీజేపీ నేతలు అన్నారు. దేవాలయానికి చెందిన ఆస్తులను ప్రభుత్వం పరిరక్షించాల్సిందిపోయి అమ్మకానికి పెట్టడమేంటని ప్రశ్నించారు.

Updated Date - 2020-05-26T20:43:27+05:30 IST